కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 13 : కరీంనగర్ కార్పొరేషన్కు ముఖద్వారం అల్గునూర్ అని, ఇది బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడి 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకూ పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. 1095 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, రావుల రమేశ్, సింగిరెడ్డి స్వామిరెడ్డి, తదితరులతో కలిసి ఆయన అల్గునూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ కట్టబెట్టి అల్గునూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి నిరూపించిన అల్గునూర్ వార్డు వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం ప్రతి కార్యక్రర్తకూ అంకితమన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో భారీ ప్రదర్శన వద్దని, తిరిగి రెండు రోజుల్లో విజయోత్సవ సంబురాలు చేసుకుందామని చెప్పారు. కార్పొరేటర్గా గెలుపొందిన కాల్వ మల్లేశం మాట్లాడుతూ, భారీ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలని తెలిపారు. తనను ఆదరించి, పది రోజుల పాటు నిద్రాహారాలు మాని కష్టపడ్డ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సల్లా మహేందర్, యూత్ అధ్యక్షుడు గట్టెపల్లి దీపక్, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.