సిరిసిల్ల రూరల్, జనవరి 5: రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు. నాయుడు హైదరబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు.
రాజన్న జోన్ పరిధి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు విస్తరించి ఉన్నది. అనంతరం కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, పోలీసు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.