కోల్సిటీ, నవంబర్ 23: ప్రతిష్టాత్మక జాతీయస్థాయి సిటీ అవార్డుల రేసులో రా మగుండం కార్పొరేషన్ దూసుకెళ్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల సూచికగా ఉన్న ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022లో భాగంగా కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరుల అవగాహన సర్వే చేపట్టింది. అర్బన్ ఔట్ కమ్స్ ఫ్రేమ్ వర్క్-2022లో భాగమైన నగరాల్లో నగర స్థాయి కార్యక లాపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి వారిని భాగస్వాములను చేయడమే ఈ సర్వే లక్ష్యం.
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాల్లో సుమారు 20 లక్షల మంది పౌరులను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో రామగుండం కూడా ఉండడం విశేషం. ఇందులో నగర ప్రజలు చురుకుగా పాల్గొనేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం నుంచి రామగుండం బల్దియాకు ఆదేశాలు అందిన ట్లు అధికారులు తెలిపారు. అర్బన్ అవుట్ కమ్స్ ప్రేమ్ వర్క్-2022లో రామగుండం నగర పాలక సంస్థ నోడల్ అధికారిగా డిప్యూటీ కమిషనర్ నారాయణరావు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజల్లో అవగాహన పెంపొందించే దిశగా కార్యక్రమాల్లో మంచి పనితీరు చూపే నగరాలకు ర్యాంకు లు ప్రకటిస్తారు. కాగా, బిల్ బోర్డులు, హోర్డింగ్స్, బ్యానర్లకు 10 మార్కులు, వాల్ పోస్టర్లకు 20, ర్యాలీలు, మాస్ క్యాంపెయినింగ్కు 10, పౌరుల ఆన్లైన్ సర్వేకు 20, పత్రికల్లో ప్రచారానికి 10, సో షల్ మీడియాలో ప్రచారానికి 10, రెడియో జింగిల్స్ బ్యాడ్జిలు ధరించడం లాంటి ప్రచారానికి 20 మార్కులు కేటాయిస్తారు.
ఈ అంశాల్లో మం చి పనితీరు చూపిన పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నారు. నగర పాలక సంస్థ చేపడుతున్న ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిత్యం నివేదిక పంపించాల్సి ఉంటుంది. కాగా, రామగుండానికి సంబంధించి ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారి నారాయణరావు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు బల్దియాకు రూ.3 లక్షలు కేటాయిస్తూ ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నగరవాసులు http://eol2022. org/ citizen feedback%2c లింక్ ఓపెన్ చేసి సర్వేలో పాల్గొనాలని ఆయన కోరారు.
డిసెంబర్ 23తో గడువు ముగి యనుండగా కేంద్రం మార్గదర్శకాల ప్ర కారం నగర జనాభాలో కనీసం ఒక శాతం కం టే ఎక్కువ మంది ఈ సర్వే ఫీడ్ బ్యాక్లో పా ల్గొంటారని అంచనా. కాగా రామగుండం పౌరుల నుంచి ఆశించిన స్పందన వస్తున్నది. ఇప్పటికీ సుమారు 1500 మంది రామగుండం పౌరులు ఆన్లైన్లో ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మిగిలిన వారు కూడా ఫీడ్ బ్యాక్ ఇచ్చి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధనకు సహకరించాలని మేయర్ అనిల్కుమార్, కమిషనర్ సుమన్రావు విజ్ఞప్తి చేశారు.