గురుకుల విద్యాలయాలస్థాయి జూనియర్ లెవల్ గేమ్స్లో రామగుండం జ్యోతిబాఫూలే గురుకుల బాలుర విద్యార్థులు మెరిశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువం బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన పోటీల్లో ఏడుగురు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో పతకాలను ఒడిసిపట్టి స్టేట్మీట్కు ఎంపికయ్యారు.
రామగుండం మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల
పెద్దపల్లి, అక్టోబర్ 20 (నమస్తేతెలంగాణ): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో రామగుండం గురుకుల స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
అథ్లెటిక్స్లో భాగంగా 100 మీటర్స్లో గోల్డ్ మెడల్, 200 మీటర్స్లో సిల్వర్ మెడల్, వాలీబాల్లో ద్వితీయస్థానం, స్టేట్ లెవల్ 100 మీటర్లకు గణేశ్నాయక్, ఆర్ రాకేణ్, బీ పవన్సాయి, అరవింద్, ఖోఖో పోటీలకు. వినయ్కుమార్ కబడ్డీకి, ఏ మాణిక్య, ప్రేమస్ వాలీబాల్ పోటీలకు సెలెక్ట్ అయ్యారు. వీరిని పలువురు క్రీడాభిమానులు, స్కూల్ టీచర్లు అభినందించారు. జిల్లా స్థాయిలో తమ పాఠశాల విద్యార్థులు చక్కని ప్రతిభ చూపారని, త్వరలో సొసైటీ, స్టేట్ లెవల్లో జరగనున్న పోటీల్లోనూ సత్తా చాటుతారని రామగుండం బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ పేర్కొన్నారు.