Dharmaramam | ధర్మారం, ఫిబ్రవరి 7 : ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి రమాబాయి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ మాత రమాబాయి కి అంబేద్కర్ తో బాల్యంలోనే వివాహం జరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బిఆర్ అంబేద్కర్ తో కలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న గొప్ప ఆదర్శవాది అని అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని రచించి గొప్ప మహోన్నతుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఆయన సతీమణిగా రమాబాయి సాధారణ జీవితం గడిపారని ఈ సందర్భంగా స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు దాగేటి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, దళిత రత్న అంబేద్కర్ అవార్డు గ్రహీత దేవి రాజలింగం, నాయకులు బొల్లి నందయ్య, మద్దునాల రాజమల్లు, సుంచు మల్లేశం, జేరిపోతుల నరసయ్య, పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, బత్తిని సాగర్, ఐలేని శ్యామ్, మండిగం గోపీచంద్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.