సిరిసిల్ల : రోగులకు మెరుగైన వైద సేవలు అందించడంతో పాటు నిర్వహణలోనూ పనితనాన్ని కనబరుస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి(Vemulawada Regional Hospital) కేంద్ర ప్రభుత్వం ఎన్క్వాస్ (NQAS ) Certificate) నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్ను అందించింది. కేంద్ర బృందం(Central Team) గత సంవత్సరం అక్టోబర్లో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించింది.
ఆస్పత్రిలో ఫార్మసీ(Pharmacy) , ఓపీడీ, అడ్మిన్, రేడియాలజీ, ఎమర్జెన్సీ, ఆక్సిలరీ సర్వీసెస్, ఐపీడీ, ఓటీ, ల్యాబ్, మెటర్నిటీ వార్డ్ లలో అందిస్తున్న సేవలకు గానూ ఎన్క్వాస్ సర్టిఫికేషన్, లేబర్ రూమ్ మెరుగైన నిర్వహణకు గానూ లక్ష్య ప్రోగ్రామ్ లో భాగంగా సర్టిఫికేషన్ను, పిడియాట్రిక్ విభాగంలో ముస్కాన్ సర్టిఫికేషన్ ను అందజేశారు.
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి ఎన్క్వాస్ గుర్తింపు పొందినందుకు గానూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(Collector Anurag Jayanthi) హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమిదేనని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన, అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.