కోనరావుపేట : కొవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని, కుటుంబ సభ్యులందరూ వేయించుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని కొండాపూర్, నిజామాబాద్ గ్రామాల్లో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎంతమంది టీకా తీసుకున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, మండల వైద్యాధికారి మోహన్కృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ మల్యాల దేవయ్య, ఎంపీవో మీర్జా, ఏపీఎం దేవరాజ్, ఉపసర్పంచ్ రవి, గ్రామపంచాయతీ కార్యదర్శులు కవిత, సాయికృష్ణ, ఏఎన్ఎం సరోజ తదితరులు ఉన్నారు.