రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 15: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11పీఎం శ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేసేందుకు ఆసక్తి గల తయారీదారులు, అధీకృత డీలర్లు, సరఫరాదారుల నుంచి సీల్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. దరఖాస్తు ఫారాలు జూలై 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 20 కాగా, సీల్డ్ టెండర్లను జూలై 21న అదనపు కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ (DPC) చైర్మన్ కార్యాలయంలో తెరవనున్నారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష కార్యాలయాన్ని కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.