సిరిసిల్ల రూరల్, నవంబర్ 28: వ్యవసాయం పొలం వద్ద బోరు కోసం కరెంట్ లైన్ వేద్దామని వెళ్లిన ఆ తండ్రి విద్యుత్ షాక్తో మృత్యుఒడికి చేరాడు. గిలగిలా కొట్టుకుంటూ పొలం వద్దే ప్రాణాలొదిలాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న ఇద్దరు పదేళ్ల బిడ్డలు గుండెలవిసేలా రోదించారు. మృతదేహం వద్ద ‘డాడీ.. డాడీ’ అంటూ రోదించిన తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. వివరాల ప్రకా రం.. తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన కూనవేని పరశురాములు(35), భార్య నవ్య, కూతుళ్లు కావ్య (12), అక్షయ (10) ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే ఆయన,
రెండేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి అత్తగారి ఊరైన అంకుసాపూర్ గ్రామ పరిధిలోని ఇందిరానగర్కు వచ్చి నివాసముంటున్నారు. రెండు గేదెలను కొని, పాలు పోస్తున్నాడు. అలాగే గ్రా మంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం పొలం వద్ద బోర్ కరెంట్ లైన్ తీయడం కోసం బా వమరిది పెడతనపల్లి ఎల్లయ్యతో కలిసి వెళ్లారు. అక్కడ బోర్ కోసం ఎల్ టీ సర్వీసు వైర్ తీస్తుండగా, సర్వీస్ లైన్కు ఉన్న జే వైరు అదే పొలం గుండా వెళ్తున్న 11 కేవీ కరెంట్ లైన్కు తగలడంతో పరశురాములు, ఎల్లయ్య కరెంట్ షాక్కు గురయ్యారు. పరశురాము లు అక్కడికక్కడే మృతి చెందగా, ఎల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలిసి కు టుంబసభ్యులు అక్కడకు చేరుకొని బోరున వి లపించారు. భార్య నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.