సిరిసిల్ల రూరల్, జూన్ 13: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసు కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. కలేక్టరేట్ సముదాయం వెనుకాలే నాలుగేండ్ల కిందట 38.50 కోట్లతో భవన నిర్మాణం మొదలైంది. జీ ప్లస్ 2 అంతస్తులతో ఉన్న ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. జిల్లా పోలీసు కార్యాలయాల సముదాయంతో పాటు పరేడ్ గ్రౌండ్, ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు తుదిదశకు చేరుకోగా త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.