సిరిసిల్ల రూరల్, జూన్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం ప్రాంతంలోని కరీంనగర్ -హైదరాబాద్ రాజీవ్హ్రదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్లకు చెందిన తాండ్ర పాపారావు(64), పద్మ (58) దంపతులు, కరీంనగర్కు చెందిన ఆంజనేయులు (48) అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. ముగ్గురి బలి
నేరేళ్లకు చెందిన తాండ్ర పాపారావు -పద్మ దంపతులు కరీంనగర్లోని భగత్నగర్లో నివాసం ఉంటున్నారు. పాపారావు కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాగా, పాపారావు కొడుకు ప్రీతంరావు అమెరికాలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో పాపారావు దంపతులు 15 రోజుల తర్వాత అమెరికా వెళ్లి, అక్కడే ఆరునెలలు ఉండి రావాలని అనుకున్నారు. ఈ లోగా ఇకడ ఉన్న బంధుమిత్రులను కలిసి అందరితో సరదాగా గడిపి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం పాపారావు-పద్మ దంపతులు కారును అద్దెకు తీసుకొని కరీంనగర్కు చెందిన డ్రైవర్ అంజనేయులుతో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గంమద్యలో సిద్దిపేట జిల్లా మల్లారం స్టేజీ వద్దకు చేరుకోగానే, మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ శ్రీనివాస్ రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. దీంతో లారీ ముందుభాగంలో కారు ఇరుక్కుపోయింది. పాపారావు-పద్మ దంపతులు, డ్రైవర్ అంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారులో ఇరుక్కుపోయిన వారిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సిద్దిపేట దవాఖానకు తరలించా రు. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లోని చలిమెడ ఆనందరావు దవాఖానలో మృతదేహాలను భద్రపరిచారు.
తండ్రి మృతిచెందిన 37రోజులకే కొడుకు, కోడలు మృతి
పాపారావు తండ్రి సూర్యరావు గత నెల 5న మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన 37 రోజులకు కొడుకు పాపారావు, కోడలు ఆదివారం మృత్యువాత పడడంతో నేరేళ్లలో విషాదం నెలకొంది. తాత మృతి చెందడంతో ప్రీతంరావు ఇటీవలే ఇక్కడికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు తల్లిదండ్రుల మృతివార్తను తెలుసుకొని అమెరికా నుంచి బయలు దేరాడని కుటుంబసభ్యులు తెలిపారు. కరీంనగర్లో ఈ నెల 14న అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.