సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 6: యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసన దీక్షను విజయవంతం చేయాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం తెలంగాణ రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నదన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి 800మంది దీక్షా శిబిరానికి తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకుంటే సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజబీంకార్ రాజన్న, ఎంపీపీ మానస, జడ్పీటీసీ మంజుల, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు వేణుగోపాల్రావు, వెంకటరావు, పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్గౌడ్, నాయకులు అంకారపు రవీందర్, పూసపల్లి సరస్వతి, నిర్మల, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
యాసంగి ధాన్యం కొనాల్సిందే: తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 6: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రజాప్రతి నిధులు, నాయకులతో సమావేశమయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసనలను విజయవంతం చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్, మాజీ చైర్మన్ అందె సుభాష్, పీఏసీఎస్ చైర్మన్ గుం డారపు కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్గౌడ్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ వికాస సమితి మద్దతు
రైతుల పక్షాన టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ వికాస సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహాధర్నాలో పాల్గొంటామని తెలం గాణ వికాస సమితి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పణిరా జారావు, నాగుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావే శంలో వారు మాట్లాడారు. అంబేడ్కర్ చౌరస్తాలో జరిగే మహాధర్నాలో తెలంగాణ వికాస సమితి కార్యకర్తలు, బాధ్యులందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆ ర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు రాచర్ల వెంకన్న, బొంపెల్లి రవీందర్రావు, నడిమెట్ల శ్రీనివాస్, శేఖర్గౌడ్, ఆంజనేయులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.