వేములవాడ టౌన్, ఫిబ్రవరి7: రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. మేడారం జాతర సమీపిస్తున్నందున భక్తజనం వేలాదిగా తరలివచ్చింది. ఈ సందర్భం గా ఉదయాన్నే స్నానం చేసిన భక్తులు కోడె మొ క్కు చెల్లించుకొని స్వామివారి దర్శనానికి బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో అధికారులు ఆర్జితసేవలను రద్దు చేశారు. శీఘ్ర దర్శనంకోసం రూ.100 టిక్కెట్లు తీసుకున్న భక్తులే దాదాపు 3 గంటలపాటు క్యూలో నిలబడాల్సి వచ్చింది. కాగా, స్వామివారిని 70వేల మంది భక్తులు దర్శించుకున్నారని, వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు 24 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఆలయ భక్తులు వేలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలంలో దా దాపు 7 నుంచి 8 వేల వాహనాలు నిలిచిఉన్నా యి. రద్దీ దృష్ట్యా ఆలయ ఈవో ఎల్ రమాదేవి ఆధ్వర్యంలో ఏఈవోలు హరికిషన్, నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, గుండి మూర్తి, రాజశేఖర్, ఇన్స్పెక్టర్స్ అశోక్, పవన్కుమార్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయాల్లోనూ రద్దీ కనిపించింది. డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యం లో పట్టణ సీఐ వెంకటేశ్ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాజన్న సన్నిధిలో అర్దమండల శివదీక్షలు
రాజన్న ఆలయ కళాభవన్లో గురుస్వామి వాసాలమర్రి గోపి ఆధ్వర్యంలో 300 మంది అర్ధ మండల శివ దీక్షలు తీసుకున్నారు. గురుస్వాములు గోపి, భీమన్న మాలధారణ చేశారు.