సిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 24: వచ్చే జనవరి 15 కల్లా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్శర్మ, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక, ధరణి, భూ సంబంధ తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా రూ.18,328 కోట్లతో 2.91 లక్షల ఇండ్లు ని ర్మించి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును రూ పొందించారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మా ణం తుది దశలో ఉందని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 33వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటివరకు 26వేల ఇండ్లు అందజేశామని తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు వారి పరిధిలో పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. నిర్మించిన ఇండ్ల కోసం అధిక సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో కేటాయింపు జరగాలని, మిగిలిన వారి వివరాలతో వెయిటింగ్ లిస్టు తయారు చేయాలని సూచించారు. ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీల్లో 18 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధించిన ఎంఎంఎలతో సమన్వయం చేసుకుంటూ త్వర గా పంపిణీ చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.205 కోట్లు మంజూరు చేశామని, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు రూ.11,990 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. నిధులకు కొర త లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుది దశ నిర్మాణం లో ఉన్న 40 వేల ఇండ్లు వేగంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలి: సీఎస్
లబ్ధిదారుల ఎంపిక, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని తేదీ నిర్ణయించుకొని అందజేయాలని సూచించారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామసభలు పూర్తి చేయాలన్నారు. జీవో 58,59,76, టీ ఎం-33 దరఖాస్తులకు పరిష్కారం చూపాల న్నారు. వీసీలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యానాయక్, బీ సత్యప్రసాద్, ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసరావు ఉన్నారు.