ఇంజినీరింగ్ కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు
ఉమ్మడి జిల్లాలోనే ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రథమం
కళాశాల యాజమాన్యం, సిబ్బంది హర్షం
తెలంగాణ చౌక్, ఏప్రిల్1: జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఉ మ్మడి జిల్లాలోని ఇంజినీరింగ్ కాలేజీల్లోనే తొలి కాలేజీగా గుర్తిం పు పొందిందని జ్యోతిష్యతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఘట్టమనేని లక్ష్మీనారాయణ, కళాశాల ముఖ్య సలహాదారురాలు డాక్టర్ పీకే వైశాలి వెల్లడించారు. ప్రెస్ భవనంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ర్టాలకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన న్యాక్ (అటానమస్ బాడి) త్రిసభ్య కమిటీ సభ్యు లు గత నెల 26, 27 తేదీల్లో కళాశాలను సందర్శించారు. విద్యావిధానం, బోధనా పద్ధతులు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వినూత్న తరహాలో విభిన్న రకాలుగా సాగిస్తున్న బోధన పద్ధతులతోపాటు టీచింగ్-లర్నింగ్, అండ్ ఎవాల్యుయేషన్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్, అండ్ ఎక్స్టెన్సస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ లర్నింగ్ రీ సోర్సెస్, స్టూడెంట్ సపోర్ట్అండ్ ప్రొగ్రెసివ్, గవర్నెన్స్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఇనిస్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్.. ఇలా పలు అంశాల మీద వారు పరిశీలించారని వెల్లడించారు. వాటిపై సంతృప్తిని వ్యక్తం చేసిన కమిటీ ఆ మేరకు ‘ఏ’ గ్రేడ్ ఇచ్చిందని చెప్పారు. ఏ గ్రేడ్ లభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ప్రధానంగా కళాశాల ఆరంభం నుంచి క్రమశిక్షణ గల సంస్థగానే కాకుండా, మారుతున్న మార్పులు, ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం విషయంలో విద్యార్థులకు తర్ఫీదునిస్తూ వారి భవిష్యత్కు బాటలు వేసినట్లు తెలిపారు.
విద్యార్థుల, భవిష్యత్, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కళాశాల తీసుకున్న అనేక సముచిత నిర్ణయాలు, ఈ రోజు ‘ఏ’ గ్రేడ్ రావడానికి కారణమయ్యాయని తెలిపారు. ఏ గ్రేడ్ లభించడం ద్వారా రీసెర్చ్ రంగంలో నిధులు వస్తాయన్నారు. ప్రధానంగా ప్రముఖ కంపెనీలు నేరుగా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తాయని, దీని ద్వారా కళాశాలలో చదివే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. కళాశాలకు దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. న్యాక్ గ్రేడ్ సాధించంపై కళాశాలలో పనిచేసే అధ్యాపకులను, సిబ్బందిని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్రావు అభినందించారని తెలిపారు. కరీంనగర్, ఇతర జిల్లా విద్యార్థులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు. లెక్చరర్లు నీలిమ, రాధికరెడ్డి, సింధూష, అశోక్, శ్రీధర్ ఉన్నారు.