ఎల్లారెడ్డిపేట : సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని జిలా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. గురువారం వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎంపీపీ రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులు రూ.14 లక్షలతో రెండు అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలలో జీపీ నిధులు రూ.4.5 లక్షలతో బాలికల మరుగుదొడ్లను నిర్మించగా వాటిని ప్రారంభించారు. మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాల వసతుల కల్పనలో ఎస్ఎంసీ చైర్మన్ రమేశ్ చూపిన చొరవను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, సర్పంచ్ కోల అంజవ్వ, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మామిండ్ల తిరుపతిబాబు, వైస్ఎంపీపీ కదిరె భాస్కర్, నాయకులు కోల నర్సయ్య, అందె సుభాశ్, వర్స కృష్ణహరి, జబ్బార్, చాకలి దేవయ్య, ఎంఈవో రఘుపతి, ప్రధానోపాధ్యాయురాలు ఆరాధన పాల్గొన్నారు.