రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే..ముస్తాబాద్ మండలం గూడెంలో మూడు రోజుల క్రితం ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి నారాయణపూర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్ అయ్యాడు. దీంతో గ్రామంలో శుక్రవారం పరీక్షలు చేయగా, పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు.
నారాయణపూర్ వాసికి ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయినప్పటికీ ప్రజలు మాస్క్లు ధరిస్తూ, శానిటైజర్ ఉపయోగిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలని వైద్యాధికారి ధర్మానాయక్ పేర్కొన్నారు.