హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పేరుతో ఒక బృహత్తర పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన శరవేగంగా కొనసాగుతున్నది.
ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కూడా ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకం కింద 12 రకాల మౌలిక వసతులను కల్పించింది. దాంతో ఆరు దశాబ్దాల ప్రభుత్వ బడికి అపురూప శోభ వచ్చింది. ఇదే విషయాన్ని ‘మన ఊరు-మన బడి’ ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఈ పోస్టును మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అరకొర వసతులతో నెట్టుకొచ్చిన సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు.. మన బడి’ కింద 12 రకాల మౌలిక వసతులు కల్పించడంతో ఆరు దశాబ్దాల బడికి అపూర్వ శోభ వచ్చింది.#ManaOoruManaBadi pic.twitter.com/6SRFo7JMUl
— మన ఊరు – మన బడి (@ManaOoruBadi) February 20, 2023