రాజన్న సిరిసిల్ల: మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రివేళల్లో సైతం కరీంనగర్ నుంచి రెస్క్యూ టీం తెప్పించి, వారితో కలిసి రాత్రి నుంచి ఇప్పటివరకు ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అతన్ని 8వ తరగతి చదువుతున్న గణేష్గా గుర్తించారు. ఈ రోజు మరో విద్యార్థి మృతదేహం లభించింది. మృతుడిని వెంకటసాయిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం నాడు మానేరు వాగు చెక్డ్యాంలో ఆరుగురు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. మరో ముగ్గురు విద్యార్థులు అజయ్, రాకేష్, క్రాంతి కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగుతూనే ఉంది.