సిరిసిల్ల రూరల్, జూలై 18: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కలిశారు. ఇటీవల పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ ఎంపీటీసీ కుంటయ్య, కుంటయ్య కుటుంబానికి హామీ ఇచ్చినట్టుగానే తన చిన్న కుమార్తెకు ఫిక్స్డ్ డిపాజిట్కు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించారు. పెద్ద కుమార్తె వివాహ పూర్తి బాధ్యత తమదేనని కుంటయ్య భార్య, కుటుంబ సభ్యులకు భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ అరుణ, అడ్డగట్ల భాస్కర్, కుర్మా రాజయ్య, క్యారమ్ పర్శరములు తదితరులు ఉన్నారు.