KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్న విషయం తెలిసిందే కాగా, ఈ సారి సిరిసిల్ల నియోజకవర్గంలోని 3,171 మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రి నేటి నుంచి అందజేయనున్నారు. ముందుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : టెన్త్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిరు కానుక అందించబోతున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ఎప్పటిలాగే ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని 17 పాఠశాలల్లో 1056 మంది, గంభీరావుపేట మండలంలోని 15 పాఠశాలల్లో 547 మంది, ఎల్లారెడ్డిపేట మండలంలోని 10 పాఠశా లల్లో 444 మంది, ముస్తాబాద్ మండలంలోని 10 పాఠ
శాలల్లో 486 మంది, తంగళ్లపల్లి మండలంలోని 11 పాఠశాలల్లో 517 మంది, వీర్నపల్లి మండలంలోని 2 పాఠశాలల్లో 121 మంది విద్యార్థులకు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల గీతానగర్ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, కుసుమ రామయ్య ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం పరీక్ష సామగ్రి అందిస్తా మని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.