రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎర్రగడ్డ తండాలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై సెస్ ఎండీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతండాలో తెగిపడిన విద్యుత్ తీగల వల్ల షాక్ కు గురై అదే తండకు చెందిన బానోతు నీల, బానోతు రవి అక్కడికక్కడే నిన్న రాత్రి మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఘటన పై సెస్ ఎండీ సీరియస్ అయ్యారు. ప్రాథమిక విచారణలో ఎర్రగడ్డ తండా గ్రామ అసిస్టెంట్ హెల్పర్ భూక్యా భావ్ సింగ్ విధుల పట్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు శుక్రవారం తేల్చారు. దీంతో ఎర్రగడ్డతండా గ్రామ అసిస్టెంట్ హెల్పర్ భూక్యా భావ్ సింగ్ ను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు మెమో జారీ చేశారు.
తక్షణమే సస్పెన్షన్ అమల్లోకి వస్తున్నట్లు మెమోలో స్పష్టం చేశారు.