బోయినపల్లి : పల్లెప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కలను నాటాలని డీఆర్డీవో కౌటిల్యరెడ్డి అన్నారు. గురువారం ఆయన కొదరుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లె ప్రకృతి, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు.
పల్లె ప్రకృతివనాల్లో అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలను నాటాలని, అదేవిధంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలందరికీ పని కల్పించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి గంగాతిలక్ , ఉప సర్పంచ్ రవిచందర్ , కార్యదర్శి అంజలి ఉన్నారు.