మంత్రి కొప్పుల ఈశ్వర్
నంది మేడారంలో పలువురికి పరామర్శ
ధర్మారం, ఆగస్టు 18: నిరుపేద దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. నంది మేడారంలోని ఎస్సీ కాలనీని మంత్రి బుధవారం సందర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన అయిలేని లింగయ్య, చెనెల్లి నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరొకరు అనారోగ్యంతో మంచం పట్టగా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం తొలిసారి కాలనీకి వచ్చిన మంత్రిని ఎంపీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్, మాల సంఘం నాయకులు, కాలనీవాసులు కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ధర్మారం జీపీ 13వ వార్డు సభ్యురాలు దేవి రేణుక మంత్రికి బొట్టు పెట్టి స్వాగతం పలికారు. నంది రిజర్వాయర్ నీరు ఇండ్ల సమీపానికి రావడంతో ఇబ్బందులు తలెత్తున్నాయని చామనపల్లికి చెందిన కొందరు మంత్రికి విన్నవించారు. దీనిపై సర్వే చేసి నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను ఈశ్వర్ ఆదేశించారు. కటికెనపల్లి సర్పంచ్ కారుపాకల రాజయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా, ఆయనను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ఎంపీటీసీ మిట్ట తిరుపతి, నాయకులు సూరమల్ల శ్రీనివాస్, పాక వెంకటేశం, ఐత వెంకట స్వామి, సూర వెంకటేశం, దేవి రమణ, దేవి నళినీకాంత్, దాసరి స్వామి, కనమండ రమేశ్,కాంపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.