ఎంత ఖర్చు అన్నది ముఖ్యం కాదు
మూలవాగుపై 12 చెక్డ్యాంల నిర్మాణం
ఎమ్మెల్యే రమేశ్బాబు
జయవరంలో రూ.7 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి ప్రారంభం
వేములవాడ రూరల్, ఆగస్టు 12 : ఎంత ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదనీ కేవలం ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. గురువారం వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామంలో రూ.7 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మాట్లాడుతూ, జయవరం గ్రామం చిన్న గ్రామమైనా మూలవాగు ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని చిన్న గ్రామమైన జయవరానికి రూ.7 కోట్ల నిధులను హైలెవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. మూలవాగుపై 12 చెక్డ్యాంలను నిర్మిస్తున్నామని, నక్కవాగుపై 3 చెక్డ్యాంల నిర్మాణానికి అనుమతులు లభించాయన్నారు. దీంతో సమీప గ్రామాలతో పాటు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే మూలవాగు జీవనదిగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలతోనే చెక్డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు.
జయవరం మీదుగా తిప్పాపూర్ వేములవాడ-సిరిసిల్ల రోడ్డు వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డును నిర్మించామన్నారు. అనంతరం హైలెవల్ బ్రిడ్జి పనులను ఆయన ప్రారంభించారు. అలాగే జయవరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఎండ్రాల పీరయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఎంపీపీ బండ మల్లేశం, జడ్పీటీసీ ఏశ వాణి, మ్యాకల రవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏశ తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, వేములవాడ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ తూం కాంతరావు, సర్పంచ్ తూం భాగ్యమ్మ, ఎంపీటీసీ తిరుపతి, మల్లారం, బొ ల్లారం సర్పంచులు పండుగ తిరుపతి, సుద్దాల లచ్చయ్య, మర్రిపెల్లి మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వనపర్తి అంజయ్య, కౌన్సిలర్లు విజయ్, అజయ్, మహేశ్, నాయకులు లింగంపల్లి దేవరాజు, మహేశ్, మధు, శ్రీనివాస్, గంగరాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.