తెలంగాణచౌక్, సెప్టెంబర్ 14: కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టాలని, శాస్త్రీయ విద్యావిధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రేకుర్తిలోని శుభం గార్డెన్లో బుధవారం జరిగిన స్టూ డెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి 4వ మహాసభకు వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ నూతన విద్యా విధానంపై విద్యార్థి సంఘాలు సమీక్షించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు స్కిల్ ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాల ను విశ్లేషించాలని విద్యార్థి సంఘ నాయకులకు సూచించారు.
విద్యార్థుల సమస్యల అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యారంగ విధానాలు, సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ఎడాపెడా విక్రయించడం, ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కూడా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘంలో క్రి యాశీలక పాత్ర పోషించి, విద్యార్థుల సమస్యలపై పోరా టం చేసినట్లు తెలిపారు. విద్యార్థి సంస్థలో ఎన్నికలను నిర్వహించాలని, అప్పటి నుంచే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు.
కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేయాలనే కేంద్రం కుట్రలను ఖండించారు. ప్రగతిశీల పో రాటాలను కొనసాగిస్తూ విద్యార్థి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఐని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అ ల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలను ఉద్యమ గడ్డ కరీంనర్లో నిర్వహించడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యదర్శి రజనీకాంత్, పూజ, శ్రీకాంత్ పాల్గొన్నారు.