Quality food | కోరుట్ల, మే 24: రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన తినుబండారాల ప్యాకెట్లు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు.
అపరిశుభ్రతమైన వాతావరణంలో తినుబండారాలు విక్రయిస్తున్న షాపు యజమానులకు రూ. 10 వేల 500 జరిమానా విధించారు. రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించాలని, నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు వడ్డిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే షాపులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారులు షాపుల నుంచి వెలువడిన తడి, పొడి, హానికారక చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెకర్లు రాజేంద్రప్రసాద్, బాలె అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్, మున్సిపల్ సిబ్బంది హేమంత్, జవాన్లు రమేష్, రాజ్ కుమార్,, తదితరులు పాల్గొన్నారు.