హుజూరాబాద్టౌన్, మే 21: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వరాష్ట్రంలో క్రీడారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా నిధుల మంజూరు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాల క్రీడా మైదానంలో హుజూరాబాద్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5ఏ సైడ్ రాష్ట్రస్థాయి హాకీ క్రీడోత్సవాల ముగింపునకు హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని హైదరాబాద్-హుజూరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభించి బాల్ కొట్టి ఆట ఆడారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి కౌశిక్రెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో ఇటీవల సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులు తమలోని ప్రతిభ వెలికితీసి రాష్ట్ర, జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా ప్రభు త్వం అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు సీఎం ఆర్థికంగా అండగా ఉండి చకటి వేదికను కల్పిస్తున్నారని చెప్పారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. హుజూరాబాద్ హైస్కూల్ క్రీడామైదానం అభివృద్ధికి ఇటీవలే రూ.10కోట్లు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12 టీంలు రాగా ప్రథమస్థానంలో హైదరాబాద్, ద్వితీయ స్థానంలో హుజూరాబాద్, తృతీయ స్థానంలో మెదక్ జట్లు నిలిచాయి. అతిథులు ఆయా జట్లకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు గందె రాధికశ్రీనివాస్, టీ రాజేశ్వర్రావు, ఎంపీపీ ఇరుమల్ల రాణిసురేందర్రెడ్డి, హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, జిల్లా హాకీ క్లబ్ నాయకులు రవీందర్సింగ్, గుడ్డేలుగుల సమ్మయ్య, పుల్ల పవన్కుమార్, ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఉమామహేశ్వర్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, బల్దియా కమిషనర్ సమ్మయ్య, మాజీ చైర్మన్ వీ విజయ్కుమార్, సీనియర్ క్రీడాకారులు చింత శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, టీ శ్రీనివాస్, కౌన్సిలర్లు కుమారస్వామి, ముక రమేశ్, నాగార్జున డైరీ ఎండీ పుల్లూరి ప్రభాకర్రావు, సామాజికవేత్త వర్దినేని రవీందర్రావు, పీఈటీలు సారయ్య, రవికుమార్, క్రీడాకారులు వినయ్, సన్నీ ఉన్నారు.