వెల్గటూర్, జనవరి 2: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందించామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. సోమవారం వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లోని 19 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.5.75 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ సాయం బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, సర్పంచులు బాలసాని రవి, దావుల నీల-లక్ష్మణ్, ఎంపీటీసీలు మూగల రాజేశ్వరి-సత్యం, సప్ప జ్యోతి-రాజు, ఉప సర్పంచులు బత్తిని భరత్, తనుగుల కవిత-మహేశ్, గాజుల భానే శ్, యూత్ అధ్యక్షుడు ఆరెల్లి వంశీ, పార్టీ సీనియర్ నాయకులు బోరె శంకరయ్య, బాలసాని సత్యం, ఎండీ అనీఫ్, ఎండీ రహీం, తరాల్ల గట్టయ్య, తిరుపతి శ్రీకాంత్, దూడ సుజాత తదితరులు ఉన్నారు.
ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు 3.76 కోట్లు
ధర్మపురి,జనవరి 2: ఎడపల్లి, జైన, రాజారం, రాయప ట్నం, తిమ్మాపూర్, కొల్వాయి, ఆరెపెల్లి ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.3కోట్ల 76 లక్షల 60 వేల నిధులు మం జూరైనట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గతేడాది జూలై 13న గోదావరి భారీ వరదల కారణంగా గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుడు మంత్రి ఈశ్వర్ వాటి మరమ్మతుకు ప్ర తిపాదనలు పంపారు. ఈ మేరకు రూ.3.76కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఎడపల్లి ఎత్తిపోతల పథకానికి రూ. 48.40 లక్షలు, జైన ఎత్తిపోతల పథకానికి రూ.31.50 లక్ష లు, రాజారం ఎత్తిపోతల పథకానికి రూ.49 లక్షలు, రాయపట్నం ఎత్తిపోతల పథకానికి రూ.69.30 లక్షలు, తిమ్మాపూర్ ఎత్తిపోతల పథకానికి రూ. 93లక్షలు, బీర్పూర్ మండ లం కోల్వాయి, ఆరెపల్లి ఎత్తిపోతల పథకానికి రూ.85.40లక్షలు మంజూరయ్యాయని వివరించారు. అయితే జూలైలో వచ్చిన వరదల కారణంగా ఈ లిఫ్టుల్లోకి భారీగా వరద నీరు చేరి మోటర్లు, పంపులు, ఎలక్ట్రిసిటీ పరికరాలు, స్విచ్బోర్డులు, ప్యానల్ బోర్డులు పూర్తిగా దెబ్బతినడంతో వీటి స్థానంలో అవసరం మేరకు కొత్త మోటర్లు బిగించడం, మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో ఈ లిఫ్టులు గోదావరి వరద నీటిలో మునగకుండా లిఫ్ట్ల ఎత్తును పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు..
నిధుల మంజూరుపై మంత్రికి కృతజ్ఞతలు
భారీవరదల కారణంగా దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.3.76కోట్లు మంజూరు చేయించిన మంత్రి ఈశ్వర్కు డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్బీ ఎస్ అధ్యక్షుడు సౌళ్ల భీమయ్య, సర్పంచు లు ఈర్ల చిన్నక్క-మొండయ్య, కుడిక్యాల మహేశ్, కాళ్ల శేఖర్, కొండపెల్లి రాంచందర్రావు, ఎత్తిపోతల పథకాల చైర్మన్లు వెంకటేశ్వర్లు, ప్రేమ్చందర్రావు, వావిలాల ప్రకాశ్, పత్తి శ్రీనివాస్, ఎర్ర మోహన్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
బాధితులకు పరామర్శ
కొద్దిరోజుల కిత్రం ధర్మపురి కోర్టు సమీపంలో ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగిపడ్డ ప్ర మాదంలో గాయాల పాలైన ఇద్దరు యువకులను మంత్రి ఈశ్వర్ పరామర్శించారు. జైన గ్రామానికి చెందిన కట్ట రాజే శ్, కోరుట్ల మల్లేశ్ కోర్టు పని మీద ధర్మపురికి వచ్చారు. లారీ విద్యుత్ స్తంభానికి తగలగా ఆ స్తంభం విరిగి అక్కడే కోర్టు బయట రోడ్డుపై నిలబడి ఉన్న రాజేశ్, మల్లేశ్పై పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇరువురిని మంత్రి పరామర్శించారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్ మహేశ్, ఏఎంసీ డైరెక్టర్ సత్యం, లిఫ్ట్ చైర్మన్ ప్రేమ్చందర్రావు, రమేశ్ ఉన్నారు.