వేదిక : కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్
తేదీలు : 26, 27
సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు..
సందర్శకులకు ఉచిత ప్రవేశం..
లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్స్
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించనుండగా, ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్, రుణాలు ఇచ్చే సంస్థలు పాల్గొంటుండగా, కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమేడ్ ఇండ్లు, ఆధునిక నిర్మాణాలకు అయ్యే వ్యయం, బ్యాంకు రుణాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై తెలుసుకోవచ్చు. సందర్శకులందరికీ ప్రవేశం ఉచితం కాగా, లక్కీ డ్రా ద్వారా బహుమతులూ పొందవచ్చు! మరెందుకాలస్యం! వచ్చేయండి!
కార్పొరేషన్, నవంబర్ 25 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహించే ఈ ఎక్స్పోను శనివారం ఉదయం 11గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ ప్రారంభించనున్నారు. వీరితోపాటు నగర మేయర్ యాదగిరి సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హాజరు కానున్నారు. శని, ఆదివారాల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్, రుణాలు ఇచ్చే సంస్థలతో కలిసి సుమారుగా 19 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. అలాగే లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించనున్నారు.
ప్రాపర్టీ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్, కరీంనగర్కు చెందిన పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు వస్తున్నాయి. వీటితోపాటు పలు భవన నిర్మాణ కన్స్ట్రక్షన్ సంస్థలు, గృహోపకరణాలకు సంబంధించి సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు తమ వెంచర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. అలాగే ఐరన్, సిమెంట్, శానిటరీ, టైల్స్, మార్బుల్, ఎలక్ట్రిసిటీ, పేయింట్స్, ఇంటీరియర్ ఇలా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వనున్నారు. ఇంకా అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హోమ్స్ సంస్థలు వస్తున్నాయి. పలు ప్రముఖ బ్యాంకులు కూడా పాల్గొంటున్నాయి. ఇండ్లు, భూములకు సంబంధించిన రుణాల మంజూరుకు కావాల్సిన పూర్తి సమాచారం వీరు అందించనున్నారు. విద్యుత్ వినియోగం పెరుగుతున్న దృష్ట్యా సోలార్ పవర్కు సంబంధించిన సమాచారాన్ని అందించే సంస్థలు కూడా ఈ షోలో పాల్గొంటున్నాయి.
ఈ ప్రాపర్టీ షోకు ‘టీ న్యూస్’ మీడియా పార్టనర్గా వ్యవహరిస్తున్నది. మెయిన్ స్పాన్సర్లుగా పీ మంగా త్రం, అపర్ణ, హైదరాబాద్ కంపెనీలు, అసోసియేట్ స్పాన్సర్గా రాయిచందని సింధ్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. కో స్పాన్సర్లుగా ఆదర్శ కంఫర్ట్స్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, స్పాన్సర్లుగా ఉస్మాని కన్స్ట్రక్షన్స్, మైత్రి గ్రూప్స్, రాయల్ రిడ్జ్, డ్యూరో, రెప్కో హోమ్లోన్స్, శ్రీ వెంకటేశ్వర అవెన్యూ, కేకే ఎంటర్ ప్రైజెస్స్, బ్యాంకులు ఎస్బీఐ, యూబీఐ, బీవోబీ, కేడీసీసీబీ కొనసాగుతున్నాయి.
రోజు రోజుకూ విస్తరిస్తున్న కరీంనగర్లో కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమేడ్ ఇండ్లు, వాటికి అందనున్న రుణసదుపాయం గురించిన పూర్తి సమాచారం ఈ షోలో తెలుసుకోవచ్చు. నగరంతోపాటు సుడా పరిధిలో నూతనంగా ఏయే వెంచర్లు అందుబాటులో ఉన్నాయి? అపార్ట్మెంట్లు, ఇండ్ల ధరలు, కల్పిస్తున్న సౌకర్యాలు, నూతనంగా అందిస్తున్న సదుపాయాలు, ఆధునిక నిర్మాణాలు, వాటికి అయ్యే వ్యయం, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు. వీటితోపాటు వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంలో రాబోయే భవిష్యత్తులో ఏ మేరకు రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుందో తెలుసుకోవచ్చు. నిర్మాణ రంగానికి సంబంధించి సమగ్ర సమాచారం పొందవచ్చు.