Jagitial Collector Satyaprasad | సారంగాపూర్, మే 18 : రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బీర్ పూర్ మండలంలోని చర్లపల్లి, కందెనకుంట, తుంగూర్, నర్సింహులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తూకం, నిల్వ, రవాణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలను అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఆయా సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రి ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యో విధంగా చూడాలన్నారు. మల్లుల వద్ద దాన్యం త్వరగా ఆన్లోడ్ అయ్యో విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకుని పొడిని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ జితేంద రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేష్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఐకేపీ, సహకార సంఘ అధికారులు, నిర్వహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.