పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 21: సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు.పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్లో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వ కానుకలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి సంవత్సరం క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించి, భోజనం పెట్టి అధికారికంగా పండుగను ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
అని వివరించారు. ఏసు ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, తహసీల్దార్ సుధాకర్, ఎంపీపీలు రమాదేవి-రాంగోపాల్ రెడ్డి,కునారపు రేణుకాదేవి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నజ్మీన్ సుల్తానామొబిన్, కౌన్సిలర్లు హాబీబా బేగంఖదీర్ ఖాన్, రేవెళ్లి స్వామి, కార్తీక్, బీఆర్ఎస్
పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, డిసెంబర్ 21: పట్టణంలోని సెక్రడ్ హార్డ్ పాఠశాలలో ముందస్తుగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఎంఈవో లక్ష్మి, వన్టౌన్ సీఐ రమేశ్బాబు అతిథులుగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలు, వృద్ధులకు స్వీట్లు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు క్రిస్మస్ వేషధారణతో వేదికపై చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం శ్రీ ధర్మశాస్త్ర వృద్ధాశ్రమం, ఎండీహెచ్డబ్ల్యూఎస్ ఆశ్రమం నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య పలు ఆశ్రమాల నుంచి వచ్చిన పిల్లలకు అల్పాహారం అందజేశారు. ఇక్కడ చర్చి ఫాదర్ రాయప్ప రెడ్డి, కరస్పాడెంట్ సిస్టర్ లవ్ లిజేకప్, ప్రిన్సిపాల్ సిస్టర్ జోప్నన్ తదితరులున్నారు.
ముత్తారం, డిసెంబర్ 21: తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నదని ఎంపీపీ జక్కుల ముత్తయ్య పేర్కొన్నారు. ప్రభుత్వంపంపిన క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు ముత్తారం చర్చిలో ఎంపీపీ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీవో కలికోట శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రవీందర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచులు తుంగాని సమ్మయ్య యాదవ్,మేడగోని సతీశ్