హుజురాబాద్ టౌన్, జూలై 10: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణం సమీపంలోని సాయి కన్వెన్షన్ అండ్ లాడ్జిలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి దగ్గర నుండి రూ.18,750 పాటు 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు హుజురాబాద్ టౌన్ ఎస్ఐ రాధాకృష్ణ తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మంది తో పాటు సాయి కన్వెన్షన్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.