ఫర్టిలైజర్సిటీ, ఏప్రిల్ 12: యువత గంజాయికి బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గంజాయి వినియోగం, కల్తీకల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలపై రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆవిష్కరించి మాట్లాడారు.
గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. వాటి విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ఫ్రీ నంబర్కు తెలియజేయాలన్నారు. గంజాయి రహిత కమిషనరేట్ కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. ఇక్కడ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, స్పెషల్ బ్రాంచీ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి తదితరులు ఉన్నారు.