Centenary Colony | రామగిరి ఏప్రిల్ 19: సింగరేణి ఆకామిటేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యదిక ఫీజుల వసూలు చేయడాన్ని అరికట్టాలని, పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సెంటినరి కాలనీ లోని వాణి ఉన్నత పాఠశాల ఆవరణలో జేఏసీ పార్టీల ఆధ్వర్యంలో శనివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వాణి పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా అధిక ఫీజులు వసూల్ చేయడం అరికట్టాలని సింగరేణి సీ అండ్ ఎం డీ, డైరెక్టర్ (పా )కు విజ్ఞప్తి చేస్తూ ఆ పాఠశాల లో సీబీఎ స్ ఈ ప్రవేశ పెట్టాలని కోరారు.