MLA Chintakunta Vijaya Ramana Rao | సుల్తానాబాద్ రూరల్, జూన్ 29 : ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలో సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరుకుల్ల, కోమండ్లపల్లి, రంగంపల్లి గ్రామాలతో పాటు వేగురుపల్లి గ్రామాల ప్రజలకు దూర భారం తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ బంకు ఉపయోగపడుతుందన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామం నుంచి కాల్వరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్ల మంజూరయ్యాయని, పనులను తర్వలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సర్పంచ్ సతీష్ కుమార్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, డీసీవో శ్రీ మాల, ఉప సర్పంచ్ సతీష్, సీఈవో సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.