కలెక్టరేట్, సెప్టెంబర్ 10: రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని చాటిన వీరనారి చాకలి ఐలమ్మ అని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాశ్, ఆర్డీవో మహేశ్వర్, రజక సంఘం నాయకులు సంపత్, శ్రీకాంత్ రజక, పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, సెప్టెంబర్ 10: స్థానిక కలెక్టరేట్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మేయర్ యాదగిరి సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆదివారం పూల మాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, సెప్టెంబర్ 10: నగరంలోని కలెక్టరేట్ చౌరస్తాలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు మల్లమ్మ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కౌన్సిల్ సభ్యులు యుగేంధర్, హేమంత్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కార్యవర్గ సభ్యుడు ముకుందరెడ్డి, నగర కార్యదర్శి గుడికందుల సత్యం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, నాయకులు తిరుపతి, అశోక్, పున్నం రవి పాల్గొన్నారు. నగరంలోని రజక సంఘ భవనంలో ఐలమ్మ చిత్రపటానికి మడేలేశ్వర రజక సహకార సంఘం అధ్యక్షుడు కొత్తకొండ రాజయ్య పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కొత్తకొండ సంపత్, డైరెక్టర్లు లక్ష్మీనర్సయ్య, శంకర్ పాల్గొన్నారు. అలాగే, కలెక్టరేట్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రజక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పూసాల సంపత్, రజక సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రశాంత్, రాజు పాల్గొన్నారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పూల మాల వేసి నివాళులర్పించారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, నాయకులు అశ్విన్, మధుబాబు, సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 10: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది సరిత, గౌతమి, లక్ష్మి, శశి, బీఆర్ఎస్ నాయకులు ఎస్ రాజనరేశ్, మోహన్, ఎం అజయ్ తదితరులు పాల్గొన్నారు.