కరీం‘నగరం’పై దట్టంగా పొగమంచు కురుస్తున్న సమయంలో ప్రజలు బతుకు ప్రయాణం సాగిస్తున్నారు. తెలతెలవారుతున్న వేళ మంచు తెరలను చీల్చుకుంటూ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ముఖ్యంగా పాల విక్రయదారులు, పేపర్బాయ్స్, పారిశుధ్య కార్మికులు, కూరగాయల వ్యాపారులు స్వెట్టర్లు, మంకీక్యాపులు, గ్లౌస్లు ధరించి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు
బుధవారం తెల్లవారుజామున కరీంగనగర్ శివారులోని మానేరు డ్యాం సమీపంలో పలువురు వాహనాలపై వెళ్తూ, ఓ కొంగ మానేరు నీళ్లల్లో ఆహారాన్ని అన్వేషిస్తున్న దృశ్యాలు ‘నమస్తే’ కెమెరాకు చిక్కాయి.