తిమ్మాపూర్ రూరల్, జనవరి11: మండలంలోని ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్రెడ్డి అధ్యక్షతన మండల సర్వ సభ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. సర్పంచులు వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత జనరల్ బాడీ సమావేశంలో చర్చించిన అంశాలను ఇప్పటి వరకు పరిషరించలేదని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సంబంధిత అధికారులపై మండిపడ్డారు. మండల స్థాయి అధికారులు వచ్చి.. డివిజన్ స్థాయి అధికారులు రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన్నెంపల్లి గ్రామంలో కుకల బెడద విపరీతంగా ఉందని..దీంతో అనేక లేగ దూడలు ప్రాణాలు కోల్పోయాయని సర్పంచ్ మేడి అంజయ్య సభ దృష్టికి తెచ్చారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని గ్రామాల్లో వారసంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీటికోసం నిధులు పుషలంగా ఉన్నాయని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒకరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మారెట్ కమిటీ చైర్పర్సన్ ఎలక అనిత, జడ్పీటీసీ ఇనుకొండ శైలజాజితేందర్రెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పరామర్శ
కరీంపేట కు చెందిన టీఆర్ఎస్ మహిళా విభాగం మండల ప్రధాన కార్యదర్శి గుర్రం భాగ్యలక్ష్మి మామ కనకయ్య సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. మంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ గంట మహిపాల్, గాండ్ల తిరుపతి, భైరి సంపత్ ఉన్నారు.