పెద్దపల్లి, అక్టోబర్ 26: కాంగ్రెస్వి ఆరు గ్యా రెంటీలు కాదు.. ఉత్త గ్యారెంటీలేనని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల టైంల ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి కబుర్లను నమ్మి ఆగం కావద్దు.. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయండి’ అని ప్ర జలకు పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ మండ లం చిన్నకల్వలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం పెద్దపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ఉచిత హామీలన్నీ ఉత్తవే అని చెప్పడానికి కర్ణాటక రైతులు కరెంట్ కోసం చేస్తున్న నిరసనే నిదర్శనమన్నారు.
తప్పదారిన కాంగ్రెస్కు ఓటు వేస్తే అది మోరిలో వేసినట్లే గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజక వర్గాన్ని తొమ్మిదన్నర ఏళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరో కారు గుర్తుకు ఓటు వేసి నన్న గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ పాల రామారావు, మండల కోఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మండల యూత్ అధ్యక్షుడు గుడుగుల సతీశ్, సర్పంచ్ ఎరుకొండ రమేశ్, ఎంపీటీసీ సంపత్, ఉప సర్పంచ్ అరుణ-మొండయ్య, గ్రామాధ్యక్షుడు భూమయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య, వార్డు మెంబర్లు ఎరుకొండ తిరుపతి, బండి తిరుపతి, కుమార్, యూత్ అధ్యక్షుడు హరీష్, కనుకయ్య, సంజీవ్, అజయ్, ఓదెలు పాల్గొన్నారు.
చిన్నకల్వల వార్డు మెంబర్ అరుటి లావణ్య, మండల మోర్చా ఉపాధ్యక్షుడు అర్కుటి రవి, బీజేవైఎం చైర్మన్ గుంటి సాయి, కార్యదర్శి ఎనగందుల అనిల్, అరుటి అవినాష్, కాంగ్రెస్ నాయకులు గుంటి సదయ్య, గంటి అంజయ్య, కుమార్, ఐలయ్య, రాజయ్య, దేవేందర్, దీపక్, కుందారపు రమేశ్, మనోహర్, రామకృష్ణ, సతీశ్, శంబు, దేవ, నర్సింహా, ఉదయ్, సాయి, విష్ణు, జీతన్, గణేశ్, సన్నీ కృష్ణ, నారాయణ చేరిన వారిలో ఉన్నారు.
పెద్దపల్లి, అక్టోబర్26: పెద్దపల్లి బీఎస్పీ పార్టీ మైనార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గురువారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇమ్రోజ్, సైఫ్, రేహాన్, అతిఫ్, తోఫిక్, సోహెల్, ఇర్ఫాన్, సోహెల్, అబ్దుల్ రెహ్మాన్, సాహిల్, సిద్దిక్, బషీర్, దస్తగిరితో పాటు తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.