పెద్దపల్లి : భారీ వర్షాలకు గోదావరి పంపు హౌస్ లో చిక్కుకున్న సింగరేణి కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. కార్మికులను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రెండు స్పీడ్ బోట్ల సహాయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి క్షేమంగా బయటికి తీసుకు వచ్చారు.
స్పీడ్ బోట్లలో స్వయంగా రెస్క్యూ టీంతో వెళ్లి కార్మికులను ఎమ్మెల్యే సురక్షితంగా బయటకు తీసుకు రావడం విశేషం. కార్మికులు క్షేమంగా బయట పడడంతో సింగరేణి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.