పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరి సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజవర్గానికి చెందిన 108 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 70,36,400 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..అనార్యోగాల బారిన పడి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స తీసుకున్న
బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా అర్ధిక భరోసాను తెలంగాణ ప్రభుత్వం కల్పింస్తుందన్నారు. రామగుండం నియోజవర్గంలో మూడు సంవత్సర కాలంలో దాదాపు రూ.4 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందించామని తెలిపారు.
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉంటుందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కారోనా రహిత రామగుండంగా మార్చాడమే తమ లక్ష్యమని, ప్రజలందరు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.