పెద్దపల్లి జంక్షన్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే ముందు ఉన్నదన్నారు. కార్యకమంలో ఎంపీపీ బండారి స్రవంతీశ్రీనివాస్, ఎంపీటీసీ రుక్కమ్మ, ఏఎంసీ డైరెక్టర్ సలేంద్ర రాములు, కౌన్సిలర్ పూదరి చంద్రశేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, పోలు సాయి, నర్ల పోలురాజు, వినీత్, రవి, శ్రీనివాస్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.