పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో మహిళా పోలీసు స్టేషన్ త్వరగా ఎర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర హోమంత్రి మహ్మద్ అలీని కోరారు. హైదరాబాద్లో హోమంత్రిని ఎమ్మెల్యే మార్యదపూర్వకంగా కలిసారు. గోదావరిఖనలో త్వరగా మహిళా పోలీసు స్టేషన్ పనులు ప్రారంభించాలన్నారు.
ఇందుకుగాను హోమంత్రిగారు సానుకులంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ సాగంటి శంకర్ నారాయణదాసు, మారుతి గౌస్ పాషా తదితరులున్నారు.