బోర్లకుంట వెంకటేశ్నేతకాని, ఎంపీ, పెద్దపల్లి.: “కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపులకు దిగుతున్నది. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని జీర్ణించుకోలేక ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్ర విభజన హామీలను ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కరించలేదు. నదీజలాల సమస్యలకు సంబంధించి వాటర్ ట్రిబ్యునల్, గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదీ చేయలేదు. ఇంకా అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపిన ఎస్సీ వర్గీకరణ బిల్లు, గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లు, సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు బిల్లులను పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల సమస్యలతో పాటు బసంత్నగర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటును తుంగలో తొక్కేసింది. ముఖ్యంగా గోదాముల్లో మూలుగుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. రాష్ర్టానికి సంబంధించి మన వాటాగా రావాల్సిన నిధులు ఇవ్వడంలేదు. తెలంగాణ అంటే ఎందుకింత వివక్ష. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల వేదికగా గొంతెత్తి నిలదీస్తాం.. ఢిల్లీ గద్దెను కదిలిస్తాం’
పెద్దపల్లి, జూలై 17(నమస్తే తెలంగాణ): ‘తెలంగాణపై కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతున్నది. అనేక సమస్యలను గాలికొదిలేసింది. బీజేపీ సర్కారు నిర్లక్ష్యంతో జిల్లాలో అనేక సమస్యలు ప రిష్కారంకాకుండానే ఉన్నాయి. ఎన్టీసీపీసీ ప్రభావిత గ్రామాలకు పరిహారంతోపాటు అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ’ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. నేటి నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ‘గొంతెత్తి నిలదీస్తాం.. ఢిల్లీ గద్దెను కదిలిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ మేరు ఆదివా రం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఆయన మాటల్లో.. ఆర్ఎఫ్సీఎల్ను నిర్మించి యూరియా ఉత్పత్తిని ప్రారంభించినప్పటికీ స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వడం లేదు. లోడింగ్ అన్లోడింగ్, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి అవకాశం లేదు. ఇంకా సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు విషయంలో రాష్ట్రంలోని టీఆర్ఎ స్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించి అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపినా, ఆ ఫైలు ముందుకే కదలడం లేదు.
దీంతో జిల్లాలోని సింగరేణి కార్మికులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పాలకుర్తి మండలం బసంత్నగర్లో నిర్మించతలపెట్టిన బసంత్నగర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు విషయంలో ఒక్క అడుగుకూడా పడడం లేదు. మంథని మీదుగా రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్కు సర్వేలతోనే కాలం గడుపుతున్నదే తప్ప కొత్త రైల్వే లైన్ను మాత్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. ఇం కా రాష్ట్ర సర్కారు చారిత్రాత్మకంగా రీఇంజినీరింగ్ పద్ధతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకూ జా తీయ హోదా ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ఊసే ఎత్త డం లేదు. కేంద్రం నిర్దేశాల ప్రకారం ప్రతి జిల్లాకు ఒక సైనిక్ స్కూల్, నవోదయ స్కూల్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, పెద్దపల్లి జిల్లాగా అవతరిం చి ఆరేండ్లయినా స్కూళ్లు మంజూరు చేయలేదు. ఇలా ఎన్నో సమస్యలు ఏండ్లుగా పేరుకుపోయా యి. మరీ ఇంతలా రాష్ట్రంపై వివక్ష, రాజకీయ కక్ష చూపుతున్న బీజేపీ సర్కారు తీరుతో జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతుండగా, వీటిపై నిగ్గదీసి ప్రశ్నించేందుకు టీఆర్ఎస్ ఎంపీలం సిద్ధమవుతున్నాం.