పాలకుర్తి, ఫిబ్రవరి 3: సీఎం కేసీఆర్ కృషితో దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న రైల్వేలైన్పై ైప్లె ఓవర్ వంతెన కల నెరవేరనున్నదని ఎమ్మెల్యే కోరుకంటి పేర్కొన్నారు. వంతెన నిర్మాణ పనులను గురువారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఫోర్లేన్ రోడ్డుపై నిర్మించే వంతెనకు రూ.11.17 కోట్లు మంజూరయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. 2013లో ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం పూర్తికాగా, ఇప్పటివరకు ఫ్లై ఓవర్పై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం స్థానికంగా ఫ్లై ఓవర్ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించడంతో సమస్యను పలుమార్లు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని, రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణ సంస్థ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించా రు. కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, ఏఎంసీ చైర్మన్ అల్లం రాజయ్య, సర్పంచ్లు బండారి ప్రవీణ్, ధర్ని రాజేశ్, గుమ్ముల రవీందర్, బాదరవేని స్వామి, కార్పొరేటర్లు సాగంటి శంకర్, కుమ్మరి శ్రీనివాస్, దొంత శ్రీనివాస్, కొమ్మువేణు, కో ఆప్షన్ వంగ శ్రీనివాస్, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, ఇంజపూరి నవీన్ కుమార్, బొడ్డు రవీందర్, తోడేటి శంకర్ గౌడ్, కొలిపాక మధుకర్ రెడ్డి, ఎదులాపూరం వెంకటేశ్, మదాసు అరవింద్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కొల్లూరి సతీశ్, అచ్చవేణు, నూతి తిరుపతి, పీచర శ్రీనివాస్, జేవీ రాజు, తానిపర్తి గోపాల్రావు, మేకల మైసయ్య, కలువల సంజీవ్, అల్లి గణేశ్, మేడి సదయ్య, మెతుకు దేవరాజ్, మేకల పోచం, ఇసంపల్లి తిరుపతి పాల్గొన్నారు.