కోల్సిటీ, ఏప్రిల్ 20: కరోనా సెకండ్ వేవ్ను అధిగమించేందుకు నగరపాలక సంస్థ పరిధిలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ పేర్కొ న్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం నగర మేయర్ డాక్టర్ అనిల్కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ దవాఖాన, పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు వివిధ డివిజన్లలో కొవిడ్ వ్యాక్సినేషన్ విరివిగా జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా తప్పనిసరిగా కొవి డ్ నిబంధనలు పాటించాలని సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 7062 ఏర్పాటు చేశామని, ప్రజలు కార్యాలయానికి వచ్చే అవసరం లేకుండా ఇంటి పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు తదితర సేవలన్నీ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా అందిస్తున్నామన్నారు.
పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన 12 స్ప్రే ట్రాక్టర్లను సిద్ధం చేసి నట్లు చెప్పారు. అవసరమైన అన్ని వాహనాలు, యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపడుతామన్నా రు. కొవిడ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యల కోసం నగర పాలక సంస్థలో 10వేల లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణానని అందుబాటులో ఉంచామన్నారు. గతేడాది కరోనాతో చాలా మంది ఇబ్బంది పడ్డారని, వైరస్ను అరికట్టడంలో పారిశుధ్య సిబ్బంది ఫ్రంట్ వారియర్స్గా సేవలందించారని, అలాగే టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కరోనా బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇపుడు అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అనిపిస్తేనే బయటకు రా వాలని, ముఖానికి మాస్క్లు, చేతులకు శానిటైజర్లు మర్చిపోవద్దన్నారు. కరోనా వైరస్తో చనిపోయిన వారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వ హించడానికి రెండు వైకుంఠ రథాలను కూడా తెప్పించామని పేర్కొన్నారు.
స్ప్రే ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ను అరికట్టడంలో భాగంగా స్ప్రే ట్రాక్టర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో మంగళవారం వాటిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్లతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా అన్ని డివిజన్లలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారని తెలిపారు. అందుకోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటి నిర్వహణను జీపీఎస్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో నగర మేయర్ డాక్టర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కమిషనర్ ఉదయ్కుమార్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.