ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటన
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ముస్తాబాద్ మండలం మోహినికుంటకు చేరుకుంటారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు మోహినికుంటలో డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైన పాలకవర్గాన్ని సన్మానిస్తారు. మధ్యాహ్నం మద్దికుంటతోపాటు చీకోడులో రైతు వేదికలను ప్రారంభిస్తారు. గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ముస్తాబాద్లో తమ నానమ్మ, తాత కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావు జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదికను ప్రారంభించి, అక్కడే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆవునూరులో రైతు వేదికను ప్రారంభించి, ఆ తర్వాత ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు చేరుకుంటారు. 3.30గంటలకు కమ్యూనిటీ భవనం, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైన పాలకవర్గాన్ని సన్మానిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.
ఇవి కూడా చూడండి..
ఒబామా నాయినమ్మ, సంఘసేవకురాలు మమా సారా కన్నుమూత