యాంగూన్: మయన్మార్లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్లాండ్కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్లాండ్లోని మే హాంగ్ సన్ ప్రావిన్స్కు చేరుకుంటున్నారు. ఆదివారం రాత్రి మూడు వైమానిక దాడులు జరిగాయని మయన్మార్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. భారీగా వలసలను ఆమోదించడానికి తాము సిద్ధంగా లేమని, అయితే మానవ హక్కులను పరిగణనలోకి తీసుకుంటామని థాయ్లాండ్ పేర్కొంది. మయన్మార్ ప్రజలు మూటాముల్లె సర్దుకుని ఇండ్లను వదిలి అడవుల్లో తలదాచుకుంటున్నారు.
మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం, ఆహారం ఇవ్వొద్దు
మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం కానీ ఆహారం కానీ ఇవ్వొద్దని అధికారులను, ప్రజలను మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. శరణార్థులు ఎవరైనా తీవ్ర గాయాలతో బాధపడుతుంటే వైద్య సహాయం అందించవచ్చన్నది. మరోవైపు, మయన్మార్లో పౌరులను సైన్యం అన్యాయంగా చంపుతున్నదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.
ఇవీ కూడా చదవండి..
ఎన్నికల వేళ బంగ్లాదేశ్లో బెంగాల్పై లెక్చర్లా..?: మమతాబెనర్జి
ఖుష్బూ దోశ.. స్మృతి ఇరానీ దాండియా