పెద్దపల్లి : విద్యను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-రామగుండం, తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద టీఎస్ ఎంసెట్ -2021 కు ప్రిపేర్ అవుతున్న 120 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అదేవిధంగా 164 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ను గురువారం పంపిణీ చేసింది.
జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్), ఎన్టీపీసీ ప్రసేన్జిత్ పాల్ గురువారం ఈడీసీలో జరిగిన కార్యక్రమంలో క్రితం సంవత్సరం ప్రశ్నపత్రాలు, వీక్లీ స్పీడ్ టెస్ట్తో సహా స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. సహయా సేవా సొసైటీ (ఇ-వాయిస్) సమన్వయంతో మొత్తం 120 మంది విద్యార్థులు ఉచిత ఆన్లైన్ టీఎస్ ఎంసెట్ కోచింగ్లో చేరారు.
ఈ సందర్భంగా 28 ప్రభుత్వ పాఠశాలలు, రెండు బీటెక్ ఇనిస్టిట్యూట్ల నుండి 164 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. వీరిలో పదో తరగతి నుండి 69 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ నుండి 93 మంది, ఇద్దరు బీటెక్ విద్యార్థులు ఉన్నారు. మొత్తం రూ .6.66 లక్షల ఉత్కర్ష్ మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో డీప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్, డి ఎస్ కుమార్, సీఎస్ఆర్ విభాగానికి చెందిన ఇతర అధికారులు, సహాయ ఇవాయిస్ పాల్గొన్నారు.